ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాల రాక

68చూసినవారు
ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాల రాక
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈసారి అంచనాల కంటే ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. ఈ నెల 13న రుతుపవనాలు అండమాన్‌కు చేరుతాయని, మే నెలాఖరున తెలంగాణను తాకుతాయని వెల్లడించింది. ఈసారి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, గతేడాది నైరుతి రుతుపవనాలు జూన్ రెండో వారంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి.

సంబంధిత పోస్ట్