ఒడిశాలోని గంజామ్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సభలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఒడిశా చాలా సంపన్నమైన రాష్ట్రం. కానీ ప్రజలు పేదవాళ్లుగానే ఉండిపోయారు. దీనికి కాంగ్రెస్, బీజేడీ పార్టీలే కారణం. కానీ జూన్ 4 తర్వాత డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతోంది. అప్పుడు రాష్ట్ర రూపురేఖలు మార్చేస్తాం’ అని అన్నారు.