ప్రజాభవన్లో శనివారం ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అవకాశం ఉన్న ప్రతి చోట మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని, తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్టీసీకి అద్దె బస్సులు అందించిన మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. తొలి నెల అద్దె కింద రూ.1.49 కోట్లు ఆయా సంఘాలకు.. మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్క అందించారు.