మొన్ననే పదోతరగతి పరీక్షలు పూర్తి.. ఈతకు వెళ్లి మృతి

56చూసినవారు
మొన్ననే పదోతరగతి పరీక్షలు పూర్తి.. ఈతకు వెళ్లి మృతి
TG: ఖమ్మం జిల్లాలో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. మున్నేరులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులు ఖమ్మం పంపింగ్‌వెల్‌ ప్రాంతవాసులుగా గుర్తించారు. కాగా మరణించిన ఇద్దరు బాలురు ఇటీవలే పదోతరగతి పూర్తి చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్