TG: ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించింది. మెదక్ జిల్లా శమ్నాపూర్కు చెందిన మైలి శ్రీను, లత భార్యాభర్తలు. మల్లేష్తో వివాహేతర సంబంబంధానికి భర్త అడ్డు తొలగించేందుకు మోహన్కు రూ.50వేలు సుపారీ ఇచ్చారు. గత నెల 16న శ్రీనును మోహన్ మద్యం తాగేందుకు తీసుకెళ్లాడు. అక్కడ శ్రీను తలపై బీరు సీసాతో కొట్టి హత్య చేశాడు. గత నెల 28న తన భర్త కనిపించడం లేదని ఠాణాలో లత ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.