అందాల పోటీలను నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై మిస్ వరల్డ్ 2025లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించనున్న నందినీ గుప్తా ప్రశంసల జల్లు కురింపించారు. ప్రపంచం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందని అన్నారు. ఇది ఒక అద్భుతమైన అవకాశం అని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పారు. స్థానిక కల్చర్ ప్రమోట్ చేసుకోవడానికి ఇది మంచి వేదిక అని నందినీ అభిప్రాయపడ్డారు.