యుద్ధం వచ్చినా నో టెన్షన్.. తగినన్ని ఇంధన నిల్వలు ఉన్నాయి: ఐఓసీ

81చూసినవారు
యుద్ధం వచ్చినా నో టెన్షన్.. తగినన్ని ఇంధన నిల్వలు ఉన్నాయి: ఐఓసీ
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు నిల్వలపై జరుగుతున్న ఫేక్‌ ప్రచారంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) క్లారిటీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. పెట్రోలు, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాల సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని తెలిపింది. ప్రజలు యుద్ధ భయంతో ఆందోళన చెందవద్దని, బంకులు లేదా గ్యాస్ డీలర్ల వద్దకు భారీగా వెళ్లాల్సిన అవసరం లేదని ఐఓసీ పేర్కొంది.

సంబంధిత పోస్ట్