భారత్- పాకిస్థాన్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణపై విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్, పాక్ ఈ రోజు ఓ అవగాహనకు వచ్చాయన్నారు. ఉగ్రవాదం విషయంలో మాత్రం భారత్ తన రాజీ లేని వైఖరిని కొనసాగిస్తుందని పేర్కొన్నారు. కాగా, భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి చేయడంతో, పాక్ కాల్పులకు తెగబడుతున్న విషయం తెలిసిందే.