కాంగ్రెస్ ​సర్కారుపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు: మంత్రి సురేఖ

81చూసినవారు
కాంగ్రెస్ ​సర్కారుపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు: మంత్రి సురేఖ
TG: కాంగ్రెస్ ​సర్కారుపై రాష్ట్ర ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె బుదవారం స్పందించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. కాంట్రాక్టర్లతో బీఆర్ఎస్​ పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదని ఆమె అన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్​ అప్పులపాలు చేసిందని మంత్రి మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్