పాస్ యాక్టివేట్ అయిన రోజు నుంచి ఏడాది లేదా 200 ట్రిప్స్ వరకు చెల్లుబాటవుతుంది. రూ.3,000 చెల్లిస్తే అదనపు రీచార్జ్ అవసరం లేదు. దరఖాస్తుకు ఆన్లైన్లో రాజమార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్హెచ్ఏఐ వెబ్సైట్ ద్వారా చేయవచ్చు. అయితే ఫాస్టాగ్ యాన్యువల్ పాస్తో పాటు, కేంద్ర ప్రభుత్వం దూరం ఆధారంగా టోల్ చెల్లింపు విధానాన్ని కూడా ప్లాన్ చేస్తోంది. దీని ప్రకారం 100 కిలోమీటర్ల దూరానికి రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధానం కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.