పీచు పండుతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తాయి. పీచులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఏ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నివారిస్తాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.