కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో సినిమా రంగం నుంచి పద్మ భూషణ్ అవార్డు నందమూరి బాలకృష్ణను వరించింది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ నటులలో చాలా తక్కువ మందికి ఈ అవార్డ్ వచ్చింది. ఎన్టీఆర్కు 1968లో పద్మశ్రీ వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావును పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. సూపర్ స్టార్ కృష్ణకు పద్మభూషణ్ అవార్డు రాగా.. మెగాస్టార్ చిరంజీవికి పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు వచ్చాయి.