ఆపరేషన్ ‘సిందూర్’లో 100 మంది టెర్రరిస్టులు మృతి చెందారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరై, ఆ దేశ పతాకం కప్పారు. లెఫ్ట్నెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, ఇమ్రాన్ సర్తాజ్, మహ్మద్ ఫర్ఖాన్ షబ్బీర్, ఉస్మాన్ అన్వర్, మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్ అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు భారత్ విదేశాంగ తెలిపింది. తొలుత తాము పాల్గొనలేదని పాక్ బుకాయించినా ఫొటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది.