సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజాలు మరోసారి తమ ప్రతిభను చాటారు. ఎట్టబోయిన సాయి శివా 11వ ర్యాంకు సాధించగా, బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకుతో మెరిశారు. అభిషేక్ శర్మకు 38వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డికి 46వ ర్యాంకు, శ్రవణ్కుమార్ రెడ్డికి 62వ ర్యాంకు లభించాయి. అలాగే సాయి చైతన్య జాదవ్ 68వ ర్యాంకు, ఎన్. చేతనరెడ్డి 110వ ర్యాంకు, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119వ ర్యాంకును సాధించారు.