పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ పరగడుపున కొన్ని పండ్లను తినడం హానికరం. నారింజ, కమలా, బత్తాయి లాంటి సిట్రస్ జాతి పండ్లను పరగడుపున తినడం మంచిది కాదు. వీటిలో ఉండే ఆమ్ల లక్షణాలు జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఈ ఆమ్ల లక్షణాలు జీర్ణాశయంలోని పై పొరను ఇబ్బందికరంగా మారుస్తాయి. గ్యాస్, పొట్ట ఉబ్బరం, అజీర్ణం లాంటి పొట్ట సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఈ పండ్లన్నింటినీ టిఫిన్ చేసిన కాసేపటి తర్వాత తినడం ఉత్తమం.