పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు 'ఇటీవల గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించుకుంటున్నాం. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. బడ్జెట్లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యత' అని రాష్ట్రపతి అన్నారు.