తెలంగాణలో రేవంత్ సర్కార్పై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు ప్రశంశల వర్షం కురిపించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని కొనియాడారు. ప్రగతి భవన్ పేరును మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్గా మార్చామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధిని చూసి BRS, BJP నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తాము కూడా అలా మాట్లాడగలమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.