బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వక్ఫ్ చట్టంపై గురువారం వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వక్ఫ్ ఆదాయం ఎక్కడికి పోతుందో అక్బరుద్దీన్, రేవంత్ రెడ్డి చెప్పాలంటూ ప్రశ్నించారు. వక్ఫ్ ఆదాయం మొత్తాన్ని అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ చెంచాలు అనుభవిస్తున్నారని చెప్పారు. దేశమంతా వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దోచుకున్నారన్నారు. సామాన్యుల కోసమే వక్ఫ్ చట్టాన్ని తెచ్చామని పేర్కొన్నారు.