కాంగ్రెస్ను నమ్మి మంచి మంచి నాయకులను ఓడగొట్టారని మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 'డిప్యూటీ సీఎం భట్టి అఫిడవిట్, నోట్లు అబద్ధపు హామీలు అన్ని ఇచ్చాడు. కాంగ్రెస్ వచ్చాక కేసీఆర్ కిట్ ఎత్తేశారు. రైతుబంధు నేడు ఒక్క పంటకి కూడా ఇవ్వడం లేదు. రైతు రుణమాఫీ లేదు, కల్యాణ లక్ష్మీ లేదు. 10 ఏళ్ల పాలన చేసిన కేసీఆర్ను కాదని కాంగ్రెస్ విసిరిన ఆనందమైన వలలో చిక్కుకున్నారు. వాళ్ళు చెప్పిన ఏ హామీ అయినా నెరవేర్చారా?' అని ప్రశ్నించారు.