TG: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలైన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు కావాలనే ఆరోపిస్తున్నారని, నేషనల్ హెరాల్డ్కు రూ.90 కోట్లకు పైగా అప్పులున్నా.. ప్రజా సమస్యల కోసం పత్రికను నడిపించినట్లు పేర్కొన్నారు.