యువతిని బైక్‌పై 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన దొంగలు (వీడియో)

51చూసినవారు
పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. గ్రీన్ మోడల్ టౌన్ ప్రాంతంలో 18 ఏళ్ల యువతి చేతిలో నుంచి ఫోన్‌ను దొంగలు లాక్కున్నారు. అయితే ఆమె తన ఫోన్‌ను గట్టిగా పట్టుకుంది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు దొంగలు ఆ యువతిని 200 మీటర్ల దూరం నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కేసులో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్