తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. కాంగ్రెస్ది ప్రచార ఆర్భాటమే తప్ప.. ఏ వర్గానికి రాష్ట్రంలో మేలు చేయలేదని ధ్వజమెత్తారు. మహిళలు, రైతులు, కార్మికులు, యువత అంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు.