పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపిన మారణ హోమంలో వేల మంది ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల మంది క్షతగాత్రులుగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో రెండు చేతులు కోల్పోయిన తొమ్మిదేళ్ల బాలుడి ఫొటో 2025 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకుంది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక జర్నలిస్ట్ సమర్ అబూ, గాజాలో పర్యటిస్తున్నప్పడు ఈ ఫొటో తీయగా అవార్డు అందుకుంది. గాజాలో చిన్నారుల పరిస్థితికి ఈ ఫొటో అద్దం పడుతుంది.