దేశ రాజధాని న్యూఢిల్లీలో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రయాణికులు చనిపోయిన సంగతి తెలిసిందే. మహా కుంభామేళాకు వెళ్లే క్రమంలో న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లోని 14,15 ప్లాట్ ఫామ్లపై ప్రయాణికులు భారీగా తరలివచ్చారు. ముందుకు వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల కుటుంబాలకు కేంద్రం ఇప్పటికే రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది.