భారత్-ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభమవ్వనుంది. సీనియర్లు లేకుండా ఇంగ్లండ్తో తలపడనున్న నేపథ్యంలో ఏదైనా ప్రత్యేకంగా చేసి తమను తాము నిరూపించుకోవడానికి యువ ఆటగాళ్లకు ఇదే సరైన సమయం అని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. 'మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటి వచ్చి పోరాడటం ప్రారంభిస్తే ప్రతి బంతినీ చిరస్మరణీయంగా మలుచుకోగలం. దేశం కోసం ఆడటం కంటే పెద్ద గౌరవం మరొకటి లేదు' అని భారత జట్టుతో గంభీర్ అన్నాడు.