AP: ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా జిల్లా రాయచోటి పుల్లంపేట మండలంలో చోటుచేసుకుంది. ఎం.రాచపల్లికి చెందిన గ్రామస్థులు శ్రీరామనవమి ఉత్సవాల్లో ఉండగా.. నరసింహరాజు కుమారుడు దేవాన్ష్ (6), శేఖర్రాజు కుమారుడు విజయ్ (6), వెంకటేష్ కుమారుడు యశ్వంత్ (7)లు నీళ్లలో దిగి మునిగి మృత్యువాత పడ్డారు. కాగా, విజయ్, యశ్వంత్ల తండ్రులు జీవనాధారం కోసం గల్ఫ్ దేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది.