TG: రాష్ట్రంలో వడదెబ్బతో మరో ముగ్గురు మృతి చెందారు. జనగామ(D) జఫర్గఢ్(M) సాగరం గ్రామానికి చెందిన శివరాత్రి శ్రీనివాస్(35) ఎనుమాముల మార్కెట్లో బస్తాలు కాంటా వేస్తూ స్పృహ తప్పి పడిపోయారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారు. సూర్యాపేట(D) ఆత్మకూర్(ఎస్)(M) మిడ్తనపల్లి గ్రామానికి చెందిన పాశం జానమ్మ(80), మహబూబాబాద్(D) కురవి(M) భద్రుతండాకు చెందిన మూడు ఈరి(50) వడదెబ్బతో మరణించారు.