శ్రీశ్రీ 1931లో చదువు ముగించుకొని విశాఖపట్నం వచ్చారు. అక్కడ టైఫాయిడ్తో 63 రోజులు బాధపడ్డారు. విశాఖ హార్బర్లో టైమ్ కీపర్గా, AVN కాలేజీలో జువాలజీ డెమాన్స్ట్రేటర్గా పనిచేశారు. 1934లో 'మహాప్రస్థానం' కవిత సంకలనానికి బీజం పడింది. ఆ గేయాలు 'జ్వాల' పత్రికలో ప్రచురితమయ్యాయి. 1938లో మద్రాసు వెళ్లి ఆంధ్రప్రభలో సహాయ సంపాదకుడిగా చేరారు. 1942లో ఆకాశవాణి (మద్రాసు, ఢిల్లీ)లో అనౌన్సర్గా, లక్నో మిలిటరీ కంటోన్మెంట్లో లేబరేటరీ అసిస్టెంట్గా పనిచేశారు.