2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు విరుచుకుపడిన ఆనాటి ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఇది దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని, దుఃఖాన్ని రేకెత్తించింది. పుల్వామా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గతంలో పలు ఎన్కౌంటర్లలో సైన్యం తుదముట్టించింది.