జింబాబ్వేతో భారత్ బుధవారం మూడో టీ20లో తలపడనుంది. సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇరు జట్లు 1-1తో ప్రస్తుతం సమానంగా ఉన్నాయి. తొలి మ్యాచ్లో ఓడిన భారత్, రెండో మ్యాచ్లో గెలిచి సత్తా చాటింది. మూడో మ్యాచ్కు జట్టులో సంజు శాంసన్, యశస్వి జైశ్వాల్, శివమ్ దూబే జట్టులో చేరనున్నారు. అభిషేక్ శర్మ ఫామ్ దృష్ట్యా మూడో మ్యాచ్లో జైశ్వాల్ బెంచ్కే పరిమితం కావొచ్చు.