నేడు ఏప్రిల్ 17 రాధాకృష్ణన్ 50వ వర్ధంతి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఉపాధ్యాయుడు, రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, పండితుడు, వక్త. భారతీయ విద్యావ్యవస్థ, రాజకీయాలపై రాధాకృష్ణన్ తనదైన ముద్ర వేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు. ఇప్పటికీ ఆయన ఆలోచనలు నేటి తరాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. రాధాకృష్ణన్ 1975, ఏప్రిల్ 17న మరణించారు.