రేపు తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. HYD జూబ్లీహిల్స్ BSNL సెంటర్లో అల్లు అర్జున్ దంపతులు, అల్లు అరవింద్, అల్లు శిరీష్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓబుల్రెడ్డి స్కూల్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి ఓటు వేయనున్నారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మహేశ్బాబు, నమ్రతా, మంచు మోహన్బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్ ఓటు వేయనున్నారు.