నేటి నుంచి రాయితీ ధరపై టమోటా!

83చూసినవారు
నేటి నుంచి రాయితీ ధరపై టమోటా!
టమోటా ధర కిలో రూ.100 పైబడి పెరగడంతో రాయితీపై ప్రజలకు సరఫరా చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈక్రమంలో సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వ హించి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజారుల్లో రాయితీపై నేటినుంచి టమాటా విక్రయాలు జరపాలన్నారు. రైతు బజార్‌లో కిలో టమోటా రూ.50కే లభించనుంది.

సంబంధిత పోస్ట్