AP: మన్యం బంద్పై గిరిజన సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రేపటి మన్యం బంద్ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తో జరిపిన చర్చలు సఫలం అయినట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీతో సంతృప్తి చెందినట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేపటి మన్యం బంద్ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు.