తెలంగాణ ఈఏపీసెట్ 2024 ఫలితాల్లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులకే వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సత్యవాడ జ్యోతిరాధిత్య ఫస్ట్ ర్యాంకు, కర్నూల్ జిల్లాకు చెందిన హర్ష రెండో ర్యాంకు సాధించారు. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో అన్నమయ్య జిల్లాకు చెందిన ఏపీ విద్యార్థిని ప్రణీత ఫస్ట్ ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన ఏపీ విద్యార్థి రాధాకృష్ణ రెండో ర్యాంకు సాధించారు.