తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు ప్రభావం చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, గుంటూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా అక్కడక్కడా వర్షం కురిసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.