తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బోటు బోల్తా పడటంతో ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. సర్పన్ పల్లి ప్రాజెక్టులో ఐదుగురు పర్యాటకులు బోటులో షికారుకు వెళ్లారు. అయితే ఈ క్రమంలో బోటు బోల్తా పడటంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.