ఉగ్రదాడి తర్వాత పహల్గామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పర్యాటకుల సందడి మళ్లీ పెరిగింది. ఈ నెలలోనే రెండోసారి పహల్గామ్ పర్యటనకు వచ్చిన సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యాటకులతో రద్దీగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. పర్యాటక పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తున్నాయని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు.