హైదరాబాద్ గాంధీ భవన్లో సోమవారం పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగనుంది. రేపు క్రమశిక్షణ కమిటీ ముందు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కొండా మురళికి వ్యతిరేకంగా ఉన్న టీమ్ను క్రమశిక్షణ కమిటీ ఆహ్వానించింది. తాడోపేడో తేల్చాలని వరంగల్ నేతలు పెట్టిన డెడ్లైన్కి గడువు ముగిసింది. రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కమిటీ ఫోకస్ పెట్టింది. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా నేతలు డిమాండ్ చేశారు.