TG: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన.. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. అక్కన్నపేట మండలంలోని పోతారం (జె) గ్రామానికి చెందిన లింగాల భాను (22) అక్కన్నపేట మండలంలోని ధర్మారం నుండి పోతారం (జె)కి ట్రాక్టర్ తీసుకు వస్తుండగా అది అదుపుతప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో ట్రాక్టర్ ఇంజన్ కింద భాను చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.