కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులు ఉప్పుటేరు కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వృద్ధ దంపతులకు చెందిన కుమారులు అమెరికాలో స్థిరపడ్డారు. అయితే కుమారులు తమను పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన దంపతులు కాలువలోకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.