మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఇంట్లో విషాదం నెలకొంది. ఈయన మామ పీఎస్ అబు(92) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈయనకు మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టి సహా నలుగురు పిల్లలు ఉన్నారు. మామ చనిపోవడంతో ప్రస్తుతం మమ్ముట్టి కుటుంబంలో శోకసంద్రంలో ఉంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.