TG: సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. హుజూర్నగర్లో ఈతకు వెళ్లిన ఇద్దరు గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శేఖర్ (14), లక్ష్మణ్(21)లుగా పోలీసులు గుర్తించారు.