'ట్రాన్స్ ఆఫ్ కుబేర' మైండ్ బ్లోయింగ్ అని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ.. "శేఖర్ కమ్ముల, నాగార్జున ‘కుబేర’ అనే టైటిల్ ప్రకటించగానే, అద్భుతం అనిపించింది. ధనుష్ వచ్చాక వావ్ సూపర్ కాంబినేషన్ అనుకున్నా. అటు ధనవంతుల ప్రపంచంలో నాగార్జున.. ఇటు పేదల ప్రపంచంలో ధనుష్ని చూపిస్తూ విడుదల చేసిన ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చాలా ఆసక్తిగా అనిపించింది." అని అన్నారు.