AP, తెలంగాణ హైకోర్టులకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవరాజు నాగార్జునను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ తాజాగా నోటిషికేషన్ జారీ అయింది. అలాగే మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పీ వడమాలైని నియమించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు ట్వీట్ చేశారు.