తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇటివల జరిగిన బదిలీలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఒక్కసారిగా 177 మంది సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ బదిలీలో భారీగా పైరవీలు జరిగాయని.. పైరవీలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్, సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.