తెలంగాణలో ఎన్నికల సమయంలో ట్రాన్స్ఫర్ అయిన తహశీల్దార్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం మళ్లీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జరీ చేసింది. మల్టీజోన్-1 పరిధిలో 55 మంది, మల్టీజోన్-2 పరిధిలో 44 మందిని తహశీల్దార్లను బదిలీ చేసింది. రెవెన్యూ అధికారుల అసోసియేషన్ వినతి మేరకు రేవంత్ సర్కార్ ఈ బదిలీలను చెప్పట్టింది. ఎన్నికల సమయంలో వేరే ప్రాంతాలకు బదిలీ అయిన వారిని సర్కార్ తిరిగి వారి ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసింది.