ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే వేదికగా గురువారం ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. SRH స్టార్ ప్లేయర్ నితీష్ రెడ్డి 19 పరుగులకు ఔట్ అయ్యారు. 17వ ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి నితీష్ పెవిలియన్ చేరారు. దీంతో 17 ఓవర్లకు SRH స్కోరు 115/4గా ఉంది. క్రీజులో అనికేత్ (1), క్లాసెన్ (16) ఉన్నారు.