గుజరాత్లోని భరూచ్లో విషాదకర ఘటన జరిగింది. ఈ నెల 19న జాతీయ రహదారి 48పై ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన ఆ ట్రక్కు అదుపుతప్పి ఆవుల మందను ఢీకొట్టింది. దీంతో ఆరు ఆవులు సంఘటనా స్థలంలోనే చనిపోయాయి. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. రెప్పపాటులో ఈ ప్రమాదం జరగడంతో తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.