మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సింగ్రౌలి జిల్లా అమిలియా ఘాటి సమీపంలో ఓ ట్రక్కు అదుపుతప్పి బైక్ పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి ఐదు బస్సులు, మూడు ట్రక్కులకు నిప్పు పెట్టారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.